జనసేనకు రూ.21 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి, టిడిపి కూటమి భాగస్వామి, జనసేన ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన నిలిచింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం గుర్తింపు లేని పార్టీలు 2019- 2021 మధ్య ఎలక్టోరల్‌ బాండ్‌ ద్వారా ఎటువంటి విరాళాలను స్వీకరించలేదు. జనసేన మాత్రమే 2022లో రూ.2 కోట్లు, 2023లో మరో రూ.2 కోట్లు, 2024లో రూ.17 కోట్లు మొత్తం రూ.21 కోట్లు అందుకుంది. గుర్తింపు లేని పార్టీలు అంటే కొత్తవి లేదా మునుపటి ఎన్నికల్లో తగినన్ని ఓట్లను సంపాదించని రాజకీయ పార్టీలు.

➡️