టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం

తిరుమల : గోవిందా నామ స్మరణతో తిరుమల ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శుక్రవారం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని 69,874 మంది దర్శించుకోగా 26,034 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చిందని తెలిపారు.

➡️