తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.శనివారం స్వామివారిని 69,232 మంది యాత్రికులు దర్శించుకోగా 26,536 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.22 కోట్లు వచ్చిందని తెలిపారు.

➡️