తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ యాత్రికులకు అభయమిచ్చారు. ఈ వాహనసేవలో యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గని శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారి వాహనసేవలు రాత్రి వరకూ కొనసాగనున్నాయి. మరోవైపు రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమల ఆలయాన్ని తితిదే అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రకరకాల పువ్వులతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.