తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల : తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. బుధవారం స్వామివారిని 66,915 మంది యాత్రికులు దర్శించుకోగా 20,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు వచ్చిందని వివరించారు.

➡️