తిరుమలలో సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి వచ్చిన యాత్రికులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం స్వామివారిని 70,158 మంది యాత్రికులు దర్శించుకోగా 24,801 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు హుండీలో వేసిన కానుకల వల్ల టీటీడీకి రూ.3.51 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

➡️