హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నఅత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు న్యూయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. ”ప్రతి ఈవెంట్లో సెక్యూరిటీ తప్పనిసరి. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలి. మద్యం అనుమతించే ఈవెంట్స్లో మైనర్లకు అనుమతి లేదు. వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన తీసుకుంటాం. వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని పోలీసులు స్పష్టం చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/99.jpg)