పోలవరం (ఏలూరు) : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, అధికారులు, టిడిపి, జనసేన, బిజెపి నేతలు స్వాగతం పలికారు. స్పీల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను సిఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరిగి బయలుదేరనున్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, టిడిపి, జనసేన, బీజేపీ నేతలు.#CBNinPolavaram #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/IEd7UftcCH
— Telugu Desam Party (@JaiTDP) June 17, 2024