వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఐ వేధింపుల కారణంగా మండలంలోని బంగారుపెంట గ్రామానికి చెందిన మత్స్యకారుడు దుర్గారావు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మఅతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశంపార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు భారీగా చేరుకోవడంతో స్టేషన్ వైపు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.