రేపు సెలవు ఇవ్వడం లేదని ప్రయివేటు సంస్థలు ఈసీకీ ఫిర్యాదులు

Nov 29,2023 16:15 #Election Commission

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నవంబర్‌ 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు అన్నీ ఈ సెలవులు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ, రేపు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. అయితే పలు ప్రయివేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రయివేటు కళాశాలలు రేపు సెలవు ఇవ్వడం లేదని.. స్థానిక అధికారుల దఅష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

➡️