విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నాం: కోమటిరెడ్డి

ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలనపై అధికారులు ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు. పదేళ్లుగా విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామని అన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మించినా ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేకపోయారని బీఆర్‌ఎస్‌ నేతలపై అసహనం వ్యక్తం చేశారు.

➡️