హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు చింతలపల్లి మండలం అద్రాస్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారి రుష్మిత సాయిని చికిత్స నిమిత్తం నారాయణగూడలోని దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.