ప్రజాశక్తి-గుంటూరు : గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం నాగవరంలో చోటు చేసుకుంది. చిన్నారి (15) స్థానిక హైస్కూల్లో 10వ తరగతి చదువుతుంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బృగుబండలో ఉన్న పరీక్షా కేంద్రంలో బుధవారం పరీక్ష రాసింది. అయితే పరీక్ష రాసి ఇంటికి వచ్చిన చిన్నారి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. కాగా, చిన్నారి కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నదని, ఆ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.