హైదరాబాద్ : చైతన్యపురి రాజీవ్గాంధీనగర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ – ఉప్పల్ రహదారిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ … రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి కమాన్ దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/car-accident.jpg)