- నెల్లూరు జిల్లా కావలిలో ఘటన
- చిన్నారుల పరిస్థితి విషమం
ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఎండ్లూరి భాస్కర్ భార్య చిన్నమ్మ, అవినాష్ (11), దీపిక (8) కలిసి నివసిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న భాస్కర్ భాస్కర్, అతని భార్య పిల్లలకు బిర్యానీలో విషం కలిపి తినిపించాడు. అనంతరం తానూ తిన్నాడు. దీంతో వాళ్లంతా వాంతులు చేసుకోవడాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.