అమరావతి: తెలుగు ప్రజలందరికీ టిడిపి అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ”ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. నేడు మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి” అని చంద్రబాబు ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు.