తెలంగాణ : ప్రముఖ గాయని మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డిసిఎం ఢకొీట్టింది. శంషాబాద్ పోలీసుల కథనం మేరకు … రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఫ్ురాజ్, మనోహర్తో కలిసి ఆమె కారులో హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్నాటకకు చెందిన ఓ డిసిఎం వ్యాన్ వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢకొీట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం దెబ్బతింది. డిసిఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/mangli.jpg)