మదనపల్లెలో వైసిపి నేత దారుణ హత్య

మదనపల్లె (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీవారినగర్‌లో వైసిపి నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో శేషాద్రి రక్తపుమడుగులో కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు పరారీ కాగా.. వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

➡️