కల్వర్టును ఢీకొట్టిన కారు – ఒకరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు

తిరుపతి సిటీ : రోడ్డుకు ఆనుకొని ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం చంద్రగిరి మండలం, ముంగిలిపట్టు వద్ద జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తిరుమల దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ముంగిలిపట్టు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి రోడ్డు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుశీల (59) మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కారులో ఉన్నవారంతా కర్నాటకలోని బంగారుపేటకు చెందినవారుగా గుర్తించారు. గాయపడినవారందరినీ వెంటనే వైద్యం నిమిత్తం 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️