ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌లో 2 సిల్వర్‌ మెడల్స్‌

– అభినంధించిన డిజిపి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ 2023-2024 పోటీల్లో రాష్ట్ర పోలీసులు రెండు సిల్వర్‌ పథకాలను సాధించడం పట్ల డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మార్చి 17 నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పుల్లెల గోపిచంద్‌ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్షిప్‌ 2023-2024 పోటీల్లో 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత రాష్ట్రాలు, కేంద్ర బలగాలకు చెందిన మొత్తం 499 మంది పోలీస్‌ క్రీడాకారులు పాల్గన్నారు. డిఐజి రాహుల్‌ దేవ్‌ శర్మ నేతృత్వంలో పాల్గన్న రాష్ట్ర పోలీసుల్లో సిఐడి డిఎస్‌పి ఎస్‌బివి సుధాకర్‌, సిఒ డిఎస్‌పి పివి మారుతిరావు సిల్వర్‌ పథకాలు సాధించారు. ఈ పోటీల్లో రాణించిన ఇద్దరినీ గురువారం మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినంధించారు.

➡️