సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్‌రెడ్డి

Apr 10,2024 22:57 #fake votes, #Tirupati district

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై బుధవారం సచివాలయంలో సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 38వేల ఓట్ల దొంగ ఓట్లు తిరుపతి నియోజకవర్గంలోఉన్నాయని ఆ ఓట్లను తొలగించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. టిటిడి ఇఓగా ధర్మారెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని ఆయన సుమారు 4వేల ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, వెంటనే ఆయనను ఇఓ బాధ్యతలనుంచి తప్పించాలని సిఇఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నటు ఆయన తెలిపారు.

➡️