ప్రజాశక్తి-యు కొత్తపల్లి : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో సంధ్యా రొయ్యల పరిశ్రమంలో గురువారం అర్ధరాత్రి నుండి సిబిఐ దాడులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు సభ్యులు గల బృందం పరిశ్రమలోకి చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విశాఖ పోర్ట్ లో ఒక కంటైనర్ లో డ్రగ్స్ దొరకడంతో సంధ్య ఆక్వా పేరు మీద నమోదు కావడంతో సంధ్య ఆక్వా పరిశ్రమ పేరు మీద ఉన్న అన్ని కంపెనీలపై సిబిఐ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో కూడా సి.బి.ఐ అధికారులు చేరుకొని కూలీల వద్ద నుండి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.