శ్రీవారి సేవలో చంద్రబాబు

ప్రజాశక్తి – తిరుమల:తెలుగు జాతి ప్రపంచలో నంబర్‌ వన్‌గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2003 శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అలిపిరి వద్ద తనకు ప్రమాదం జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి కాపాడారన్నారు. తాజాగా వచ్చిన కష్టం దూరమవ్వాలని మొక్కుకున్నానని, మొదటగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నానని, కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, అమరనాథరెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఉన్నారు.

➡️