పరీక్ష తేదీలను మార్చండి.. ఎస్‌బీఐకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ

Feb 19,2024 16:57 #Exams, #SBI

ప్రజాశక్తి- అమరావతి: క్లర్క్‌ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు. ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లర్కు నియామక పరీక్షను నిర్వహిస్తోంది. అదే రోజు గ్రూప్‌ 2 పరీక్షను ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు అభ్యర్థులు రెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారని, వారు అవకాశం కోల్పోకుండా ఎస్‌బీఐ ఆరోజు పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు. కాగా ఎస్బీఐ క్లర్క్‌ నియామకాలకు సంబంధించి ప్రిలిమ్స్‌ ను జనవరి 5, 6, 11, 12 తేదీల్లో నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి ఫిబ్రవరి 25, మార్చి 4న మెయిన్స్‌ నిర్వహించనున్నారు.

➡️