కల్యాణదుర్గంలో ఘర్షణ

Apr 18,2024 21:40 #Clash, #Kalyandurgam, #TDP, #YCP
  • టిడిపి, వైసిపి నాయకుల పరస్పర దాడులు
  • ఇరు గ్రూపులపై కేసులు నమోదు

ప్రజాశక్తి-కల్యాణదుర్గం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. టిడిపి వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలుగుజేసుకుని ఇరుగ్రూపులను అక్కడి నుంచి పంపివేయడంతో సమస్య సద్దుమనిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పట్టణంలోని 12వ వార్డులో టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్థానిక నాయకులతో కలిసి గురువారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా టిడిపి ప్రచార రథానికి అడ్డంగా వైసిపి నాయకులు వారి ప్రచార రథాన్ని ఉంచారు. వాహనాన్ని పక్కకు తీయాలని వైసిపి నేతలను టిడిపి నాయకులు అడిగారు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర దాడులకు దిగారు. వైసిపి నాయకుల దాడిలో టిడిపి నాయకుడు, మాజీ మున్సిపల్‌ చైౖర్మన్‌ వైపి రమేష్‌ అస్వస్థత గురయ్యారు. టిడిపి నాయకుల దాడిలో వైసిపి నాయకులు బిక్కిరి మంజునాథ్‌, అనిల్‌ గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు గ్రూపులవారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపివేశారు. ఈ ఘటనపై టిడిపి, వైసిపి మద్దతుదారులు వేర్వేరుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

➡️