ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 5:45 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 6 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకుంటారని సిఎంఒ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 6 గంటల నుంచి 6:20 గంటల వరకు ఎన్టిఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టి కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తారు. 6:30 గంటల నుంచి 7:15 గంటల వరకు పెనుమాకలోని మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించనున్నారు. అనంతరం పెనుమాక నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/chandrababu-naidu.jpg)