ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలీసులు కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన దళిత యువకుడు మోజెస్ మృతి చెందాడు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఈనెల 6న (బుధవారం) పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని అతడు నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మోజెస్కు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మోజెస్ చికిత్స పొందుతూ మంగళవారం మతిచెందాడు.