ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఛైర్మన్గా కాంగ్రెస్ ఎపి మేనిఫెస్టో కమిటీని నియమించింది. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పల్లంరాజు (ఛైర్మన్), సభ్యులుగా బాపిరాజు, జెడి శీలం, తులసిరెడ్డి, కమలమ్మ, జంగా గౌతమ్, ఉషా నాయుడు, నజీరుద్దీన్, కొరివి వినరు కుమార్, గంగాధర్, రమాదేవి కారుమంచిని నియమించింది. అన్ని కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.