రైతు బంధును ఆపింది కాంగ్రెస్సే : హరీశ్‌ రావు

తెలంగాణ : రైతుబంధు మీద కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం జహీరాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ … యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని అన్నారు. రైతుబంధు ఇచ్చేందుకు 3 రోజుల క్రితమే ఈసీ అనుమతి ఇచ్చిందని.. అయితే కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు వల్లే రైతుబంధును ఈసీ మళ్లీ ఆపిందని అన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. రైతుబంధు ఖతం అవుతుందని చెప్పారు. కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని హరీశ్‌రావు తెలిపారు.

➡️