– మత్య్సకారుల వలకు చిక్కిన వైనం
ప్రజాశక్తి-మద్దిపాడు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని మల్లవరం గుండ్లకమ్మ రిజర్వాయర్లో చేపల వలలో మొసలి కనిపించడం కలకలం రేపింది. అన్నంగి గ్రామానికి చెందిన మత్స్యకారుడు అనిల్.. బుధవారం రాత్రి రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వలవేసి వెళ్లారు. గురువారం ఆ వలను తీసుకునేందుకు వెళ్లగా అందులో మొసలి చిక్కుకొని.. చనిపోయి ఉంది. ఫారెస్ట్, మత్స్యశాఖ అధికారులు మొసలిని పరిశీలించారు. మృతదేహాన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శశిభూషణ్ స్వాధీనం చేసుకున్నారు.