లాహోర్ : మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన పాకిస్తాన్ ముస్లింలీగ్ (ఎన్) నేత నవాజ్ షరీఫ్ వచ్చే నెల 11న తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆయనను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవిని వదిలిపెట్టి ఆయన లండన్కు ప్రవాసం వెళ్లారు. పాక్ రాజకీయాలను శాసిస్తున్న సైన్యంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా కేసులను మాఫీ చేసుకుని గత ఏడాది తిరిగి దేశంలోకి అడుగుపెట్టారు. ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.