ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అనేక జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో పంటలు ముంపునకు గురైయ్యాయి. కోతకోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని తీసేందుకు అనేక ఇబ్బందులు పడవల్సి వచ్చింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా సారిపల్లి వానిపాలెంలో పూరింట్లోకి వర్షపు నీరు ప్రవహించడంతో ఆ ఇంట్లో చిక్కుకున్న వృద్ధురాలిని ఎస్ఐ విభూషణరావు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
నిజాంపట్నం మిచౌంగ్ తుఫాన్ ఈదురు గాలులతో గజగజలాడుతున్న 60 యస్ టి కుటుంబాలకు యుటిఎఫ్ నిజాంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు దుప్పట్లు తినుబండారాలు అందించడం జరిగింది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో 839 ఎకరాలలో నేలకొరిగిన అరటి.
నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలోని తుఫాను బాధిత ప్రాంతాలైన 53 మరియు 54 డివిజన్లలో పర్యటించిన సిపిఎం రాష్ట్ర నాయకత్వం
తుఫానుకు సబ్బవరం-పాతరోడ్డు నుండి గుల్లేపల్లి రోడ్డు బాగా దెబ్బతిన్నది
కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలంలోని చొప్పెల్లలో వర్షపు నీటితో మునిగిన బట్టి వ్యవస్థ
నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంటలను పరిశీలించిన సిపిఎం బృందం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి గంగాధర్.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మక్కినవారి గూడెం గ్రామాల మధ్య పొంగి ప్రవహిస్తున్న ఎర్రకాలువ
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం సిరిపల్లి వ్యవసాయ క్షేత్రంలో వర్షపు నీటిలో నానుతున్న వరి చేలు.
బాపట్ల జిల్లా అనంతవరం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలు, తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న సీపీఎం బృందం.. బాధిత రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
తుఫాను వలన పునరావస కేంద్రాలకు చేరిన బాధితుల బాగోగులు అడుగుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, పరామర్శించిన సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ అనీఫ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు, ఒంగోలు నగర్ కార్యదర్శి జి రమేష్, సీపీఎం నగర కమిటీ సభ్యులుటి మహేష్, హుస్సేన్.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం ఎండపల్లి వలస గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఎండపల్లి వలస గ్రామ కాపురస్తులు కిల్లో మహేష్ ఇళ్ళు ఒకపక్క పడిపోయింది.
అల్లూరి జిల్లా రాజవొమ్మంగి, డి.మల్లవరం గ్రామ రహదారి మధ్యలో కొట్టుకుపోయిన కల్వర్టు
కాకినాడ మండల కేంద్రమైన రౌతులపూడి-మల్లంపేట రహదారి మధ్య ఉన్న ఏలేరు వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షం నీరు
కాకినాడ ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు ఇల్లు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ముంచెత్తిన వర్షం… లోతట్టు ప్రాంతాలు జలమయం… మునిగిన ఇంట్లో చిక్కుకున్న వృద్ధురాలిని రక్షితంగా బయటకు తీసుకుని వస్త్తున్న ఎస్ఐ విభూషణరావు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం పూర్తిగా నీటితో నిండిపోయి చెరువుగా మారడంతో వలలు వేసి చేపలు పడుతున్న స్థానికులు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో నీట మునగటంతో జేసిబి సహయంతో ధాన్యని బయటకు తీస్తున్న రైతులు
మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మోదుగ ఏజెన్సీ పంచాయతీలో గల మెట్టవలస గ్రామంలో మృతి చెందిన రెండు పశువులు
మన్యం జిల్లా మక్కువ మండలంలో ఎడతెరిపి లేని వర్షంతో నీట మునిగిన వరి చేలు
మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి : ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం లో మించౌంగ్ తుఫాన్ వల్ల, వరి, మిరప, బుడ్డ శనగ, కంది పలు పంటలు దెబ్బతిన్న దృశ్యాలు
బొర్రా గుహలు సమీపంలో రైల్వే గేటు వద్ధ రోడ్డుపై జారీ పడ్డ కొండ చరియలు. బొర్రా గుహలు మూసివేత. రాకపోకలు నిలిపివేసిన అధికారులు..
అల్లూరి జిల్లా చింతూరు మండలం కటుకాపల్లి జాతీయరహదారిపై అడ్డంగా విరిగిపడిన చెట్లు. రవాణకు తీవ్ర అంతరాయం
మిచాంగ్ తుఫాను కారణంగా అల్లూరి జిల్లా హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ, దుర్గం గ్రామంలో కూలిన ఇల్లు… ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పిలుచుకున్న అధికారులు..
విజయనగరం జిల్లా విజినిగిరి, తానవరం గ్రామాల్లో నీటిలో మునిగిన వరి పంట కుప్పలు
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా తడిసి ముద్దయిన వరి చేను
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా మాతుమూరు గురువు నాయుడుపేట గ్రామాల మధ్య ఉన్న కాజ్వేకు గండి