తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

Dec 23,2023 11:30 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. స్వామివారి దర్శనం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. టోకెన్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.

➡️