విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ నాలుగో రోజు ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర ఈరోజు సింగ్నగర్ రోడ్డులో జరుగుతుంది. ” దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంచించిన బిజెపి-వైసిపిలను గద్దె దించండి.. నిరంకుశ బిజెపితో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించండి.. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం, వామపక్షాలను బలపరచండి..” నినాదంతో వారంరోజులపాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం ‘జన శంఖారావం’ పాదయాత్ర కొనసాగనుంది. సింగ్నగర్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నేతలు ప్రసంగించారు.
https://www.facebook.com/share/v/3Kk6NwnRJP3oup6p/?mibextid=oFDknk