గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ దుర్ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

Nov 29,2023 16:20 #died, #four members, #gas leak

విశాఖపట్నం : ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బుధవారం మరణించారు. జిల్లా కేంద్రంలోని మధురవాడ వాంబే కాలనీలో నివాసముంటున్న బాలరాజు అనే వ్యక్తి అయ్యప్పమాల ధరించాడు. గత శుక్రవారం వంట గ్యాస్‌ అయిపోవడంతో కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు.రెగ్యులేటర్‌ను సక్రమంగా అమర్చకపోవడం వల్ల గ్యాస్‌ లీకేజీ అయిన విషయం అతడు గమనించ లేదు. కొద్ది సేపు అనంతరం దేవుడి చిత్రపటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో బాలరాజుతో పాటు భార్య చిన్ని, కుమారులు గిరి, కార్తిక్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను 108 అంబ్‌లెన్స్‌లో కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ చిన్న కుమారుడు కార్తిక్‌ రెండు రోజుల క్రితం చనిపోగా బాలరాజు(60), అతడి భార్య చిన్ని (55), పెద్ద కుమారుడు గిరి(22) బుధవారం చికిత్సపొందుతూ మఅతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం పట్ల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

➡️