ఎంసెట్‌ బుక్స్‌ ఇవ్వాలని విద్యార్థుల ధర్నా

Apr 27,2024 21:36 #Dharna, #SFI

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) :ఎంసెట్‌ బుక్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విజనగరం జిల్లా బబ్బిలిలోని నారాయణ జూనియర్‌ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం ధర్నా చేశారు. కళాశాలలోని ఇంటర్‌ విద్యార్థుల నుంచి యాజమాన్యం ఎంసెట్‌ బుక్స్‌ కోసం డబ్బులు వసూలు చేసింది. ఈ కళాశాలలోనే కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన యాజమాన్యం బయట ప్రయివేటుగా కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులకు ఇవ్వలేదు. బుక్స్‌ కోసం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మణికుమార్‌ మాట్లాడుతూ ఎంసెట్‌ బుక్స్‌ కోసం విద్యార్థులు నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తక్షణమే పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బుక్స్‌ ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

➡️