టీటీడీకి రెండు బస్సులను విరాళంగా అందజేసిన దాతలు

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డీఐ జానకిరామరెడ్డి పాల్గన్నారు.తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 5 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం స్వామివారిని 58, 278 మంది యాత్రికులు దర్శించుకోగా 17,220 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3. 53 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.

➡️