సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : నర్సరావుపేట రూరల్ మండలం సాతులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగులు డి.రామకృష్ణ అటెండర్ గా పనిచేస్తున్నాడు. ఎన్నికల డ్యూటీ వేశారు. సత్తెనపల్లి మండలం కోమెరపూడి లో ఓపిఓ గా విధులు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాగులను నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు కేటాయించకూడదని ఉన్నప్పటికీ ఓపిఒ గా డ్యూటీ వేశారని రామకఅష్ణ వాపోతున్నారు.