అమరావతి : జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఎపి ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.