చెన్నై : తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విరుదునగర్ జిల్లా కలెక్టర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/fire-acident-4.jpg)