నెల్లూరులో గవర్నర్‌ నజీర్‌

Mar 14,2024 00:01 #Abdul Nazir, #Governor, #Nellor, #Visit
  •  పిఎం సూరజ్‌ జాతీయ పోర్టల్‌ ప్రారంభం

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు జిల్లా పర్యటనలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బిజీబిజీగా గడిపారు. బుథవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న ఆయనకు మంత్రి కాకాణి గొవర్ధన్‌రెడ్డి, ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మేయర్‌ స్రవంతి స్వాగతం పలికారు. అక్కడ నుంచి స్థానిక కస్తూర్బా కళా క్షేత్రంలో జరిగిన పిఎం సూరజ్‌ జాతీయ పోర్టల్‌ను గవర్నర్‌ ప్రారంభించారు. సఫాయి కర్మచారి లబ్ధిదారులకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద హెల్త్‌ కార్డులు, కిట్లు పంపిణీ చేశారు. వివిధ పథకాల అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. గవర్నర్‌ రాక సందర్భంగా నెల్లూరులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

➡️