ప్రజాశక్తి-గూడూరు టౌన్ (తిరుపతి జిల్లా) :తిరుపతి జిల్లా గూడూరు వైసిపి ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బిజెపిలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం వరప్రసాద్రావుకి పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రావు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డిఎ కూటమి ఘనవిజయం సాధిస్తుందని పేర్కొన్నారు.