ప్రజాశక్తి-అమరావతి : టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిఖిల్ సిద్ధార్థకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిఖిల్ రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారని సమాచారం. కాగా హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్కి అల్లుడు. ఈ నేపథ్యంలో మామ గెలుపు కోసం అల్లుడు టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/nikhil.jpg)