లోకేష్‌ను కలిసిన పారిశ్రామికవేత్త పాపారావు కుటుంబం

Apr 30,2024 10:30 #family, #Industrialists, #met, #Nara Lokesh

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ మురళీకఅష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ముందుగా లోకేష్‌ను కలసిన పాపారావును పలు అంశాల్లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయాలపైన కూడా కూలంకషంగా చర్చించారు. ఉమ్మడి కూటమికి అనుకూలంగా ఉందని ప్రచారంలో మరింత వేగం ఉండాలని సూచించానని, ఈ మేరకు పాపారావు మంగళవారం స్థానిక విలేకరులకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలవేళ వీరి కలయిక రాజకీయ ప్రత్యేకతను సంతరించుకుందని టిడిపి వర్గీయుల్లో ఇష్టాగోష్ఠి నడుస్తోంది.

➡️