పులివెందుల్లో ఇంటింటి ప్రచారంలో వైఎస్ భారతి
ప్రజాశక్తి -పులివెందుల టౌన్ :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పింది చేస్తాడని, టిడిపి అధినేత చంద్రబాబు చెప్పి మోసం చేస్తాడని సిఎం జగన్ భార్య వైఎస్ భారతి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్రెడ్డిని, అవినాష్రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతంరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన హామీలన్నీ మోసపూరితమైనవని విమర్శించారు. జగన్ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసిపిని గెలిపించాల కోరారు. కార్యక్రమంలో వైఎస్ అవినాష్రెడ్డి భార్య సమత, అభిషేక్రెడ్డి భార్య కృష్ణచైతన్య పాల్గొన్నారు.