దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన కొండా నరేంద్ర

ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోటకు చెందిన టిడిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ నరేంద్ర శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. తంబళ్లపల్లి నియోజకవర్గపు ప్రస్తుత నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా కొండ నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ … తంబళ్లపల్లి నియోజకవర్గంలో తాను చేపట్టిన రైతు సదస్సులు, ఇతర కార్యక్రమాలపై పురందేశ్వరికి వివరించగా ప్రత్యేకంగా ప్రశంసించారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా తాను రాజకీయాలకు వచ్చానని తాను పుట్టిన నియోజకవర్గం ప్రజలకు మంచి చేయాలన్నదే తన సంకల్పమన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ … తంబళ్లపల్లి నియోజవర్గం పరిస్థితుల్ని పరిశీలిస్తున్నామని నియోజవర్గాన్ని అభివృద్ధిపరిచే దిశగా మంచి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలియజేసినట్లు కొండా నరేంద్ర తెలిపారు.

➡️