కమలాపురంలో ఆలస్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

కడప : కడపలోని కమలాపురంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం ఉదయం 8 గంటలు అయినప్పటికీ అధికారులు విధులకు హాజరుకాలేదు. కమలాపురం రిటర్నింగ్‌ ఆఫీసర్‌, ఏపీఆర్వో లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకొని వెంటనే డ్యూటీకి వెళ్లాలంటూ … పోలీస్‌ సిబ్బంది అసహనాన్ని వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ లో ఈరోజు ఉదయం 9 గంటలకు 723 మంది ఉద్యోగస్తులకుగాను 105 మంది ఉద్యోగస్తులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.

➡️