బిజెపిని ఓడించి స్టీల్‌ప్లాంటును కాపాడుకుందాం

Apr 30,2024 00:16 #visaka steel plant
  •  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : రాబోవు ఎన్నికల్లో బిజెపిని ఓడించి స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుందామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 1173వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ టిపిపి, పిఇఎం, స్టోర్స్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ.. అశేష త్యాగాలతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్‌ సేల్‌ పేరుతో నూరు శాతం అమ్మకానికి పెట్టి ప్రజాద్రోహానికి పాల్పడిందన్నారు. ఈ ద్రోహానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మిక వర్గం, విశాఖ జిల్లా కార్మికులు, ప్రజాసంఘాలు, ప్రజలు గత మూడేళ్లుగా సమైక్య ఉద్యమం నిర్వహిస్తున్నాయని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను అష్టదిగ్బంధనం చేసి, కావాలనే నష్టాల్లోకి నెట్టి కారు చౌక గా మోడీ అనుకూల కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు కుట్ర జరిగిందని విమర్శిం చారు. ఈ కుట్రలను ఉక్కు కార్మికవర్గం, జిల్లా ప్రజానీకం తిప్పి కొట్టాలని కోరారు.

➡️