అమరావతి : నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవంనాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని సిఎం పేర్కొన్నారు. అలాగే… రాజ్యాంగకర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని కోరుకుంటూ ముఖ్యమంత్రి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/cm-jagan-7.jpg)