వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్లు అందజేత

ప్రజాశక్తి – యలమంచిలి : పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం, యలమంచిలి, కాజ పడమర, కొంతేరు తదితర గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్‌ లబ్ధిదారులకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పింఛను సొమ్ము సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసిపి బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట ప్రకారం తమ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్‌ సొమ్ము పెంపు చేశారన్నారు. అడవిపాలెం గ్రామంలో మంత్రి రామానాయుడు స్వయానా వృద్ధుల కాళ్లు కడిగి వారికి పింఛన్లు అందజేశారు.

➡️